ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) కు వెళ్లిన తొలి ఇండియన్ గా చరిత్ర సృష్టించిన వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను అశోకచక్ర పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. ఈ సందర్భంగా భారత కీర్తి పతాకాన్ని అంతరిక్ష కేంద్రంలో రెపరెపలాడించిన వింగ్ కమాండర్ శుభాన్షుకు అశోక చక్ర పురస్కారం ఇచ్చి గౌరవించింది ప్రభుత్వం. రిపబ్లిక్ డే సందర్భంగా సోమవారం ( జనవరి 26) పురస్కారాన్ని అందుకోనున్నారు.
అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర పురస్కారాలను ప్రకటించిన కేంద్రం త్రివిధ దళాలకు చెందిన 13 మందికి శౌర్య చక్ర పురస్కారాలు ప్రకటించింది. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్నుకీర్తి చక్ర పురస్కారం వరించింది. మేజర్ అర్షదీప్ సింగ్, నైట్ సుబేదార్ దోలేశ్వర్ సుబ్బాలను కీర్తి చక్ర పురస్కారాలలు వరించాయి.
అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారత వ్యోమగామి
శుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామి.1984లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో మొదటిసారి అడుగుపెట్టారు. యాక్సియోమ్–4 మిషన్లో భాగంగా స్పేస్ఎక్స్అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్కు నాసా మాజీ ఆస్ట్రోనాట్పెగ్గీ విట్సన్ సారథ్యం వహించగా.. పైలట్గా శుభాన్షు శుక్లా వ్యవహరించఆరు. యాక్సియోమ్–4కు ఎంపికైన వ్యోమగాములు పెగ్గీ విట్సన్(అమెరికా), శుభాన్షు శుక్లా(ఇండియా), ఉజ్నాన్ స్కీ(పోలెలండ్), టిబోర్ కపూ(హంగేరీ)లు ఐఎస్ఎస్కు చేరుకుని అక్కడ రెండు వారాలపాటు పరిశోధనలు చేసి భూమికి తిరిగి వచ్చారు.. ఈ ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) భాగస్వామిగా ఉన్నది.
యాక్సియోమ్మిషన్–4లో భాగంగా భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్, ఇస్రో ఆస్ట్రోనాట్శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొదటి భారతీయుడఉ. అదే క్రమంలో రోదసిలో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగానూ శుక్లా చరిత్ర సృష్టించారు. ఇస్రో చేపట్టబోయే మావనసహిత అంతరిక్ష మిషన్(గగన్యాన్)కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుభాన్షు శుక్లా ఒకరు. జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ సంస్థ 2004లో చేపట్టిన న్యూషెపర్డ్(ఎన్ఎస్–25) మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన గోపిచంద్ తోటకూర అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా రికార్డు సృష్టించారు.
అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి వ్యక్తులు:
* 1984, ఏప్రిల్లో రష్యా వ్యోమనౌక సోయాజ్టి–11లో అంతరిక్షంలోకి వెళ్లి తొలి భారతీయుడిగా రాకేశ్ శర్మ రికార్డు సృష్టించారు.
* అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా కల్పనా చావ్లా చర్రిలో నిలిచారు.
* సునీతా విలియమ్స్(2012, 2024) ఎక్కువ సమయం స్పేస్వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు.
* సబార్బిటల్ ఫ్లైట్లో ప్రయాణించిన తొలి ఇండియన్ అమెరికన్ స్పేస్ టూరిస్ట్గా, రోదసీలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన రెండో మహిళగా బండ్ల శిరీష రికార్డు సృష్టించారు.
* రాజాచారి (2021), ఆండీ సాద్వని(2024)లో అంతరిక్షంలోకి వెళ్లారు.
