కాంగ్రెస్​తోనే అన్నివర్గాల అభివృద్ధి సాధ్యం : గడ్డం ప్రసాద్ కుమార్

కాంగ్రెస్​తోనే అన్నివర్గాల అభివృద్ధి సాధ్యం : గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్/చేవెళ్ల, వెలుగు: అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి రంజిత్​రెడ్డి మంగళవారం స్పీకర్​గడ్డం ప్రసాద్​తో కలిసి వికారాబాద్ నియోజకవర్గం మోమిన్​పేట మండలం కేంద్రంలో రోడ్​షో నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. రంజిత్​రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ లోపు రైతు రుణమాఫీ చేస్తామని, మిగిలిన గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. రంజిత్​రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. అలాగే రంజిత్​రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి సీతారెడ్డి మంగళవారం చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు, వెంకన్నగూడ, కౌకుంట్ల, అంతారం గ్రామాల్లో ప్రచారం చేశారు.