
ఉత్తరాఖండ్ : గర్భవతి అయినప్పట్నేంచే పెద్ద డౌట్లు. పుట్టబయేది ఆడబిడ్డా, మగబిడ్డా అని. ఇంకేముందు గుట్టుచప్పుడుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం..ఆడ అని తెలిస్తే చాలు కడుపులో చంపేయడం. దీంతో ఆడబిడ్డలు పుట్టడమేలేదంటా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. ఆరునెలల్లో ఉత్తరకాశీ జిల్లాలోని 16 గ్రామాల్లో 65 మంది పిల్లలు పుడితే.. వారిలో కనీసం ఒక్క ఆడపిల్లయినా లేదంటా. ఆ ప్రాంతాల్లోని వైద్యపరీక్షా కేంద్రాల్లో చట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు జోరుగా జరుగుతన్నట్లు తెలుస్తుంది. గర్భస్రావాలు జరుగుతున్నాయేమోననీ అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితిపై పూర్తిగా దర్యాప్తునకు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఆదేశించారు. ఇది అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన పరిస్థితి అని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి రేఖా ఆర్య తెలిపారు. ఉత్తరకాశీ జిల్లాలోని మరో 66 గ్రామాల్లో కూడా మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్యే తక్కువగా ఉందని జిల్లా కలెక్టరు ఆశిష్ చౌహాన్ తెలిపారు. కల్పనా ఠాకూర్ అనే సామాజిక కార్యకర్త మాట్లాడుతూ.. ఇందుకు భ్రూణహత్యలే కారణం కావచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు.