
హైదరాబాద్: గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో బొడ్రాయి పండుగ సందర్బంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఉద్రిక్తత దారి తీసింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడుల చేసుకున్నారు.
బొడ్రాయి పండుగలో దళితులు పాల్గొనవద్దు.. పూజలు చేయొద్దంటూ.. అగ్రవర్ణ నాయకులు హుకుం జారీ చేశారని.. ఇదేంటని ప్రశ్నించిన ఊకుమ్మడిగా దాడి చేశారని దళితులు ఆరోపించారు.
మహిళలు అని చూడకుండా విచక్షణా రహితంగా దాడి చేశారు.. మీరు అంటరాని వారు.. మీరు పూజలు చేయొద్దు.. అని కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాకు న్యాయం జరగకపోతే ఆందోళన చెపడతామని హెచ్చరించారు.