మంత్రి కాన్వాయ్ ని అడ్డుకునేందుకు యత్నం

మంత్రి కాన్వాయ్ ని అడ్డుకునేందుకు యత్నం

మంత్రి హరీష్ రావు కాన్వాయ్ వెంట పరుగులు తీసిన సీపీఐ నాయకులు 

కోహెడ/హుస్నాబాద్, వెలుగు: ప్రభుత్వం సన్నరకం వడ్లకు కనీస మద్దతు ధర రూ. 2,250 ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం హుస్నాబాద్ కు వచ్చిన మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని సీపీఐ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి వచ్చిన మంత్రికి సీపీఐ నాయకులు వినతిపత్రం ఇస్తామని కోరగా అనుమతి ఇవ్వలేదు. దీంతో కాన్వాయ్​ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మార్కెట్ కమిటీ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. మంత్రి కాన్వాయ్​ ఆపకపోవడంతో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.