
నవీపేట్, వెలుగు: నవీపేట్లోని మహేశ్కంప్లెక్స్ లో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎం మెషిన్ డోర్లు తెరిచి, లాకర్ ను బద్ధలు కొట్టే ప్రయత్నం చేశారు. అలారం మొగి హెడ్ ఆఫీస్ కు సమాచారం చేరడంతో స్థానిక పీఎస్కు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతలోనే ఇద్దరు నిందితులు పల్సర్ బైక్ పై పరారీ అయ్యారు.