ఆయిల్ పామ్ సాగు లక్ష్యం 7 వేల ఎకరాలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఆయిల్ పామ్ సాగు లక్ష్యం 7 వేల ఎకరాలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, వెలుగు: ఈ ఏడాది 7వేల ఎకరాల్లో ఆయిల్​పామ్​ సాగు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో మాట్లాడారు. రైతు వేదికల ద్వారా ఆయిల్​పామ్​ పంటకు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. 

2022 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 2,375 మంది రైతులు 6,164 ఎకరాల్లో ఆయిల్​పామ్​ సాగుచేయగా 1,476 ఎకరాల్లో పంట కోతలు జరుగుతున్నాయన్నారు. ఆయిల్​పామ్​ రైతులకు నాలుగేండ్లపాటు  ఎకరానికి సర్కార్​ నుంచి ఆర్థిక తోడ్పాటు అందుతుందన్నారు.