భద్రాద్రికొత్తగూడెం/ కాశీబుగ్గ/ ములుగు/ జనగామ అర్బన్/ భీమదేవరపల్లి/ ఖమ్మం టౌన్, వెలుగు: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఆయా కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ములుగు కలెక్టరేట్లో మొత్తం 81 అర్జీలు వచ్చాయని అడిషనల్ కలెక్టర్ సీహెచ్.మహేందర్ జీ పేర్కొన్నారు.
జనగామలో అత్యధికంగా 401 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్కు చెందిన 40 మంది రైతులు కలెక్టర్ చాహత్బాజ్పాయ్ని కలిసి గౌరవెల్లి ప్రాజెక్ట్ద్వారా భూములు కోల్పోతున్నామని పెరిగిన మార్కెట్ వ్యాల్యూకి తగ్గట్టుగా పరిహారం అందించాలని వినతి పత్రం అందజేశారు. భద్రాద్రికొత్తగూడెంలో కలెక్టర్ అంకిత్, ఖమ్మం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
