- ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీజేపీకి అధికారం కలే
- ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీజేపీకి అధికారం కలే..
- బీఆర్ఎస్బావబామ్మర్దులను ప్రజలు నమ్మట్లే : టీపీసీసీ చీఫ్మహేశ్ కుమార్గౌడ్
నిజామాబాద్, వెలుగు : 'వెస్ట్బెంగాల్ లో 93 లక్షల ఓట్లను చోరీ చేసి మమతాబెనర్జీని ఓడగొట్టిన బీజేపీ అదే ప్లాన్ ను తెలంగాణలో అమలు చేసేందుకు కుట్ర చేస్తోంది' అని టీపీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఆ ఎత్తులు ఇక్కడ సాగవని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం జరిగే పనికాదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబీన్ సభ రెండు వేల మంది కూడా రాలేదని, ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమిటో ఈ సభలతోనే అర్థం అవుతుందన్నారు.
నిజామాబాద్జిల్లా నందిపేటలో సోమవారం జరిగిన బీఎల్ఏల మీటింగ్లో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఎలక్షన్కమిషన్ప్రధాని మోదీకి తొత్తుగా పనిచేస్తోందని ఆరోపించారు. ఓట్లను తొలగించే ప్రయత్నాలను కాంగ్రెస్బీఎల్ఏలు అడ్డుకోవాలని, పట్టణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. చెల్లె కవితను బయటకు పంపిన కేటీఆర్.. బావ హరీశ్రావును వెంటేసుకొని రాష్ట్రమంతా తిరుగుతున్నారని, వాళ్లిద్దరు ఒకరికొకరు హ్యాండ్ఇచ్చుకోవడానికీ వెనుకాడరని ఎద్దేవా చేశారు. వారిద్దరినీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
అనంతరం నిజామాబాద్ లో ఓలింపిక్ రన్ ను ప్రారంభించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీకి 8 సీట్లు కూడా రావన్నారు. ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా, ఇతర పార్టీలతో కలిసినా అధికారంలోకి మాత్రం రాదన్నారు. కాంగ్రెస్100 సీట్లకుపైగా గెలిచి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, పన్నెండున్నరేండ్ల సెంట్రల్గవర్నమెంట్మోసాలపై చర్చకు రావాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావుకు సవాల్చేశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్రెడ్డి, రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, ఆకుల లలిత, నగేశ్ రెడ్డి, అంతిరెడ్డి రాజిరెడ్డి, చిన్నా పాల్గొన్నారు.
