51 కొత్త బ్రాంచులను ప్రారంభిస్తాం.. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటన

51 కొత్త బ్రాంచులను ప్రారంభిస్తాం.. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటన

న్యూఢిల్లీ: యూ​నివర్సల్ బ్యాంక్​గా మారడానికి ఆర్​బీఐ నుంచి సూత్రప్రాయంగా మొదటిసారి ఆమోదం పొందిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్,  దేశవ్యాప్తంగా 51 కొత్త బ్రాంచులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మనదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ బ్రాంచులు ఆగస్టు 15న మొదలవుతాయి.  

వీటిలో 30 లయబిలిటీ బ్రాంచులు  21 మైక్రోఫైనాన్స్, ఇంక్లూజివ్ బ్యాంకింగ్ బ్రాంచులు ఉన్నాయి. వీటిని పశ్చిమ బెంగాల్, గుజరాత్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు లాంటి చోట్ల ఏర్పాటు చేశారు.