
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాకు చెందిన ఆర్ఈఏ గ్రూప్ నుంచి హౌసింగ్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ ప్రాప్టైగర్ను కొనుగోలు చేస్తామని ఆరమ్ ప్రాప్టెక్ లిమిటెడ్ బుధవారం ప్రకటించింది. ప్రాప్టైగర్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో 100శాతం ఈక్విటీ షేర్లను ఆర్ఈఏ ఇండియా పీటీఈ(సింగపూర్) నుంచి షేర్ స్వాప్ విధానంలో కొనుగోలు చేయనుంది.
ఈ స్వాప్లో భాగంగా 42,42,537 షేర్లను ఆర్ఈఏకు ప్రిఫరెన్షియల్ ఆధారంగా జారీ చేస్తారు. ఆర్ఈఏ ఇండియాకు ఆరమ్ ప్రాప్టెక్లో 5.5శాతం వాటా దక్కుతుంది.