ఈ మధ్య కాలంలో రైళ్లలో సెఫ్టీ లేకుండా పోయింది. ఎప్పుడు ఏ రైలు ప్రమాదానికి గురవుతుందో తెలియని పరిస్థితి. దీంతో రైళ్లలో ప్రయాణించాలంటే ప్రజలు వణికే పరిస్థితి నెలకొంది. అయితే రైలు ప్రమాదాలతో జనం ఇబ్బంది పడుతుండగా..తాజాగా ఓ రైలు బోగీ వర్షపు నీటితో నిండిపోయింది. భారీ వర్షానికి ఏసీ కోచ్ లో నీరు లీకై జనం తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ముంబై -ఇండోర్ అవంతిక ఎక్స్ప్రెస్లో వర్షం నీరు లీకైంది. రైలులోని రెండో ఏసీ కోచ్లోని ఎయిర్ కండిషనింగ్ నుంచి నీరు లీక్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తడిసిపోయారు. ఈ ఘటన జూన్ 24వ తేదీ శనివారం ముంబై సమీపంలో చోటుచేసుకుంది. ఏసీ కోచ్ లో ఎయిర్ కండిషనింగ్ నుంచి నీరు లీక్ కావడంతో రైల్వే సిబ్బంది శుభ్రం చేశారు.