కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత డాక్యుమెంటరీకి అవార్డు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత డాక్యుమెంటరీకి అవార్డు

కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ డాక్యుమెంటరీ అయిన ఆల్ దట్ బ్రీత్స్(All That Breathes) L'Oeil' d' or అవార్డును దక్కించుకుంది. కాలుష్యం నేపథ్యంలో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ పక్షులను రక్షించేందుకు పూనుకున్న ఇద్దరు సోదరుల ఆధారంగా తీయబడింది. అంతే కాదు ఈ ఫిల్మ్ ఇప్పటికే వరల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ ను కూడా సొంత చేసుకుంది. ఇక్కడ ఇంకో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే భారతదేశం నుంచి అధికారికంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లోకి అడుగుపెట్టిన డాక్యుమెంటరీగా కూడా ప్రసిద్ధికెక్కింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓ ప్రత్యేక ఫొటోను షేర్ చేస్తూ.. అవార్డు అందుకున్నందుకు గాను కంగ్రాజ్యులేషన్స్ అంటూ ఇండియన్ ఫిల్మ్ మేకర్ శౌనక్ సేన్ ను ప్రశంసించారు. ఇలా ప్రపంచ వేదికపై ఈ అవార్డును తీసుకోవడం అనేది మరికొందరు ఇండియన్ మేకర్స్ కి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు.