
ఆక్సియం మిషన్ 4 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కు సక్సెస్ఫుల్గా డాక్ అయింది. ఇస్రో వ్యోమగామి శుభాన్షు శుక్లాను తీసుకెళ్తున్న స్పేస్ఎక్స్ ఆక్సియం-4 మిషన్ గురువారం(జూన్26) సాయంత్రం 4.30 గంటలకు ISS తో అటాచ్ అయింది.భారత్ వ్యోమగామి శుక్లాతో పాటు అంతరిక్ష నౌకలో పోలాండ్కు చెందిన మిషన్ నిపుణులు స్లావోజ్ ఉజ్నాన్విస్నీయె స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు, యునైటెడ్ స్టేట్స్కు చెందిన మాజీ నాసా వ్యోమగామి, కమాండర్ పెగ్గీ విట్సన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో అడుగుపెట్టారు. రెండు వారాలపాటు అనేక పరిశోధనలు చేయనున్నారు.
1984లో అంతరిక్షంలో తొలిసారి అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తర్వాత శుభాన్ష్ శుక్లా అంతరిక్షంలో అడుగుపెట్టారు. మిషన్ పైలట్ అయిన శుక్లా, నాలుగు దశాబ్దాల తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారతదేశపు రెండవ వ్యోమగామి. ఈ చారిత్రాత్మక మిషన్ కు 39 ఏళ్ల ఫైటర్ పైలట్ను ఇస్రో ప్రధాన వ్యోమగామిగా ఎంపిక చేసింది.
ALSO READ | యాక్సియం–4 మిషన్ లాంచ్.. అంతరిక్షంలోకి దూసుకెళ్తోన్న శుభాంశు శుక్లా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాల్గవ ప్రైవేట్ వ్యోమగామి మిషన్ ఆక్సియమ్ మిషన్ 4 ..ఇది విజయవంతంగా గురువారం సాయంత్రం 4.30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) హార్మొనీ మాడ్యూల్ అంతరిక్ష-ముఖ పోర్ట్కు డాక్ అయింది.
ఆక్సియమ్ మిషన్ 4లో భాగంగా నలుగురు వ్యోమగాములు దాదాపు రెండు వారాలపాటు ISS లో పరిశోధనలు చేస్తారు.సైన్స్, ఔట్రీచ్ ,వాణిజ్య కార్యకలాపాలతో కూడిన మిషన్ను నిర్వహిస్తారు. ఈ మిషన్ లో భారత్ తన మొదటి ఇస్రో వ్యోమగామిని స్టేషన్కు పంపుతోంది. ఈ ప్రైవేట్ మిషన్ లో పోలాండ్ ,హంగేరీ నుంచి అంతరిక్ష కేంద్రంలో బస చేసే మొదటి వ్యోమగాములు కూడా ఉన్నారు.
The #Ax4 crew—commander Peggy Whitson, @ISRO astronaut Shubhanshu Shukla, @ESA astronaut Sławosz Uznański-Wiśniewski, and mission specialist Tibor Kapu—emerges from the Dragon spacecraft and gets their first look at their home in low Earth orbit. pic.twitter.com/5q0RfoSv4G
— NASA (@NASA) June 26, 2025
ఆక్సియం 4 మిషన్ ను జూన్ 25, 2025న SpaceX ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా కేప్ కెనవరల్ ఫ్లోరిడాలోని NASA కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. సిబ్బంది దాదాపు 14 రోజుల పాటు ISS లో ఉండి మైక్రోగ్రావిటీ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలు,31 దేశాల నుంచి 60కి పైగా సైంటిఫిక్ స్టడీస్ నిర్వహిస్తారు.
ఈ మిషన్ భారత్, పోలాండ్ ,హంగరీకి మానవ అంతరిక్ష ప్రయాణంలో తిరిగి ప్రవేశించడానికి ఒక మార్గాన్ని సూచిస్తుంది. ఈ దేశాలు తమ జాతీయ అంతరిక్ష కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ మిషన్ను దోహదం చేస్తుంది.
ఆక్సియం స్పేస్ తన భవిష్యత్ వాణిజ్య అంతరిక్ష కేంద్రం అయిన ఆక్సియం స్టేషన్ అభివృద్ధికి ఇది ఒక ముందడుగు.ఈ మిషన్ NASA, Axiom Space ,SpaceX మధ్య సహకారంతో నిర్వహించారు. ఇది తక్కువ-భూమి కక్ష్యలో వాణిజ్య కార్యకలాపాలను విస్తరించడానికి కీలకమైంది.