పోక్సో కేసులో ఒకరికి జీవిత ఖైదు

పోక్సో కేసులో ఒకరికి జీవిత ఖైదు
  • శిక్ష విధించిన ఉప్పర్​పల్లి కోర్టు

గండిపేట, వెలుగు : పోక్సో కేసులో దోషికి జీవిత ఖైదువిధిస్తూ రాజేంద్రనగర్​లోని ఉప్పర్​పల్లి కోర్టు తీర్పునిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివరాంపల్లి ప్రాంతానికి చెందిన 
బి. సత్యనారాయణ 2021లో ఓ మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపారు.

కేసు విచారణలో భాగంగా శుక్రవారం సత్యనారాయణకు జీవిత ఖైదు విధిస్తూ  ఉప్పర్​పల్లి కోర్టు తీర్పునిచ్చింది. అదే విధంగా 2015లో మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డ సర్దార్ చందా సింగ్​కు పదేండ్ల జైలు, రూ20 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. వీరిద్దరిని చర్లపల్లి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.