ప్రజా శాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్

ప్రజా శాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్
  • వరంగల్ ఎంపీగా పోటీ చేస్తారని కేఏ పాల్ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. సోమవారం అమీర్​పేట లోని పార్టీ ఆఫీస్​లో ఆయనకు కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగనున్న ఎంపీ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా బాబూ మోహన్ పోటీ చేస్తారని పాల్ ప్రకటించారు.

ఇప్పటి వరకు ఆయన1,500 సినిమాల్లో నటించారని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మందికి బాబూ మోహన్ సుపరిచితులని పాల్ అన్నారు. రెండు సార్లు టీడీపీ నుంచి, ఒక సారి టీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారని, టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారని ఈ సందర్భంగా పాల్​ గుర్తు చేశారు.