అయిజ, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో నార్మల్డెలివరీలో 5 కేజీల బరువుతో పాప జన్మించింది. కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామానికి చెందిన సుజాతకు పురిటి నొప్పులు మొదలవ్వడంతో కుటుంబ సభ్యులు గురువారం రాత్రి 11గంటల టైంలో అయిజలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లారు. డాక్టర్ అందుబాటులో లేకపోడంతో డ్యూటీలో ఉన్న స్టాఫ్నర్స్ జ్యోతి.. సుజాతకు నార్మల్డెలివరీ చేసింది. 5కిలోల బరువుతో పాప జన్మించింది. శుక్రవారం ఉదయం పీహెచ్సీ డాక్టర్ స్వరూపారాణి మాట్లాడుతూ.. సాధారణంగా పిల్లలు 2.5 నుంచి 3కిలోల బరువుతో పుడతారని, నార్మల్ డెలివరీలో 5కిలోల బరువుతో పుట్టడం అరుదు అని చెప్పారు. ఇన్టైంలో డెలివరీ చేసిన స్టాఫ్నర్సును అభినందించారు. సుజాతకు ఇది మూడో కాన్పు కాగా మొదటి రెండు కాన్పుల్లోనూ ఆడ పిల్లలే పుట్టారు.
