ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి టీ20 పోరులో టీమిండియా 7 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘన్ నిర్దేశించిన 157 పరుగుల టార్గెట్ను భారత యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో సునాయాసంగా ఛేదించాడు. ఈ గెలుపుతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 1–0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకు పోయింది.
సంజు ఫ్లాప్.. అభిషేక్ శివ తాండవం:
సంజు శాంసన్ అట్టర్ఫ్లాప్: 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని పక్కనబెట్టి మరీ దక్కించుకున్న అవకాశాన్ని సంజు శాంసన్ మళ్లీ చేతులారా పాడుచేసుకున్నాడు. తీవ్ర ఒత్తిడిలో వచ్చి కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కి వెనుతిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు.
* అభిషేక్ తుఫాన్ బ్యాటింగ్: ఓపెనర్ సంజు శాంసన్ విఫలమైనా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఆఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 32 బంతుల్లోనే 82 పరుగులు సాధించి, ఆఫ్ఘన్ నిర్దేశించిన టార్గెట్గా ఈజీగా చేజ్ చేసేశాడు చేశాడు. అభిషేక్ ఔటైనా తర్వాత క్రీజులో ఉన్న ఇషాన్ కిషన్ (43) అద్భుతమైన బ్యాటింగ్ తో మ్యాచ్ ని గెలిపించాడు.
ఒమర్జాయ్ పోరాటం వృథా:
అంతకుముందు టాస్ ఓడి బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ (3/19) ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు. 43 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పకపకా నవ్విన ఆఫ్ఘన్ను అజ్మతుల్లా ఒమర్జాయ్ (64 నాటౌట్), మహ్మద్ నబీ (33) 83 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. వీరి పోరాటంతో ఆఫ్ఘన్ 20 ఓవర్లలో 156/8 స్కోరు నమోదు చేసినప్పటికీ, అభిషేక్ సృష్టించిన సునామీ ముందు అది ఏమాత్రం సరిపోలేదు. ఇక సంజు శాంసన్ కి లభించిన గోల్డెన్ ఛాన్స్ను వృథా చేసుకోవడంతో, సెప్టెంబర్ 15వ తేదీన జరగబోయే రెండో టీ20లో సంజుపై వేటు వేసి వైభవ్ సూర్యవంశీని తిరిగి తుది జట్టులోకి తెచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
