‘మహాదేవ్’ స్కామ్‌‌లో కింగ్‌‌ పిన్ బాఘెల్

‘మహాదేవ్’ స్కామ్‌‌లో కింగ్‌‌ పిన్ బాఘెల్

న్యూఢిల్లీ: మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో చత్తీస్‌‌గఢ్ సీఎం, కాంగ్రెస్ నాయకుడు భూపేశ్ బాఘెల్‌‌ కింగ్‌‌ పిన్ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. స్కామ్​ ద్వారా ప్రజల కష్టార్జితాన్ని దోచుకొని తన ఖజానాను నింపుకోవడంతో పాటు కొంత భాగాన్ని గాంధీ కుటుంబానికీ పంపాడని ఆరోపించారు. 

సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ యాప్​ ప్రమోటర్లు బాఘెల్‌‌కు సుమారు రూ.508 కోట్లు చెల్లించినట్లు ఇటీవల ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి మోసాలకు పాల్పడకుండా బాఘెల్​పై చర్యలు తీసుకుంటామని భాటియా చెప్పారు. చత్తీస్‌‌గఢ్‌‌ను దోచుకోవడానికి బాఘెల్‌‌కు కాంగ్రెస్ అధిష్టానం పొడిగింపు ఇచ్చిందని ఆయన ఆరోపించారు.

ALSO READ : బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోకి తుల ఉమ, స్రవంతి