కొత్త ఫీచర్లతో బజాజ్ ఎలక్ట్రిక్​​ త్రీవీలర్లు

కొత్త ఫీచర్లతో బజాజ్ ఎలక్ట్రిక్​​ త్రీవీలర్లు

హైదరాబాద్, వెలుగు:  బజాజ్​ఆటో కార్గో,  ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రీవీలర్‌‌‌‌లను హైదరాబాద్‌‌‌‌లో మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది.   బజాజ్ ఆర్​ఈ, ఈటీటెక్​ 9.0 ను వాలూజ్‌‌‌‌లోని కంపెనీ ప్లాంటులో తయారు చేశారు. ఎక్కువ రేంజ్, లోడ్ మోసే సామర్థ్యం, గ్రేడబిలిటీ, మన్నిక వీటి ప్రత్యేకతలు. 

 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌‌‌‌లలో ఐపీ67 రేటెడ్ అధునాతన లిఆయాన్​బ్యాటరీని బిగించారు.  బ్యాటరీని 220 వోల్టుల ఎలక్ట్రికల్ అవుట్‌‌‌‌లెట్‌‌‌‌లో ఛార్జ్ చేయవచ్చు. ఒక్కసారి చార్జ్​చేస్తే 178 కిలోమీటర్లు వెళ్తాయి.   వీటిపై 5 సంవత్సరాలు లేదా 1.2 లక్షల కిలోమీటర్ల వారంటీ ఉంటుంది.