హైదరాబాద్, వెలుగు: బజాజ్ఆటో కార్గో, ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రీవీలర్లను హైదరాబాద్లో మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. బజాజ్ ఆర్ఈ, ఈటీటెక్ 9.0 ను వాలూజ్లోని కంపెనీ ప్లాంటులో తయారు చేశారు. ఎక్కువ రేంజ్, లోడ్ మోసే సామర్థ్యం, గ్రేడబిలిటీ, మన్నిక వీటి ప్రత్యేకతలు.
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లలో ఐపీ67 రేటెడ్ అధునాతన లిఆయాన్బ్యాటరీని బిగించారు. బ్యాటరీని 220 వోల్టుల ఎలక్ట్రికల్ అవుట్లెట్లో ఛార్జ్ చేయవచ్చు. ఒక్కసారి చార్జ్చేస్తే 178 కిలోమీటర్లు వెళ్తాయి. వీటిపై 5 సంవత్సరాలు లేదా 1.2 లక్షల కిలోమీటర్ల వారంటీ ఉంటుంది.