హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో బక్రీద్ పండుగను నిరాడంబరంగా జరుపుకొన్నారు. ఏటా ఉత్సాహంతో ఖుర్బానీ పంచి పెట్టేవాళ్లు కరోనా కారణంగా ఇంట్రస్ట్ చూపలేదు. ఇంట్లోనే ప్రారన్థలు చేసుకుని, కాలనీల్లో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కొవిడ్ రూల్స్ మేరకు కొద్ది మంది ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే మసీదుల్లో నమాజ్ చేశారు. సీపీ అంజనీకుమార్ సిటీలోని పలు ప్రాంతాలతో పాటు మక్కా మసీద్, చార్మి
నార్ ఏరియాల్లో బందో బస్తును పరిశీలించారు. అడిషనల్ సీపీలు శిఖాగోయల్, డీఎస్ చౌహాన్, జాయింట్ సీపీ స్పెషల్ బ్రాంచ్ తరుణ్ జోషి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.