జర్నలిస్టులకు ఫేస్ బుక్ ద్వారా క్షమాపణ చెప్పిన బాలయ్య.

జర్నలిస్టులకు ఫేస్ బుక్ ద్వారా క్షమాపణ చెప్పిన బాలయ్య.

హిందూపురం నియోజకవర్గంలో బుధ‌వారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణ జ‌ర్న‌లిస్టుల‌పై మండిప‌డ్డారు. ఆయ‌న ప్ర‌చారానికి చిన్న పిల్ల‌లు అడ్డుగా వ‌స్తుండ‌డంతో ఆయ‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది ఆ పిల్లలను పక్కకు లాగి ప‌డేశారు. ఈ దృశ్యాల‌ను వీడియో తీసిన రిపోర్ట‌ర్ పై తిట్ల దండ‌కం మొద‌లుపెట్టి, ఆ వీడియోను డిలీట్ చేయాల్సిందిగా బాల‌య్య‌ హెచ్చ‌రించారు.అంతే కాదు “మా బతుకులు మీ చేతుల్లో ఉన్నాయా” అంటూ.. కొన్ని భారీ డైలాగులను కూడా వ‌దిలారు.

ఆ తర్వాత ఈ ఘటనపై ఫేస్‌బుక్‌లో స్పందించిన ఆయ‌న… అక్కడ ఉన్న చిన్నపిల్ల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరి మూకల పని అని భావించి వారిని వారించడం జరిగిందని , అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసిందన్నారు. అంతేకానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని అన్నారు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కుడిగా పోటీ చేయ‌బోతున్న బాల‌య్య న‌టించిన రాజ‌కీయ నేప‌థ్య సినిమా “లెజెండ్” నేటితో 5 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది.