లడ్డూ పైసలతో దహనవాటిక నిర్మాణం

లడ్డూ పైసలతో దహనవాటిక నిర్మాణం

రూ.6 లక్షలతో కట్టిస్తున్న మాజీ సర్పంచ్​ సత్తయ్య

బాలాపూర్ వేలంలో ​ గణపతి లడ్డు  అదృష్టం దక్కకున్నా ఆ నిధులతో సామాజిక సేవకు ముందుకు వచ్చారు మాజీ సర్పంచ్​ కొత్తకుర్మ సత్తయ్య.  దాదాపు రూ.6లక్షల వ్యయంతో తన తల్లిద్రండులు కొత్తకుర్మ రోశమ్మ, పోచయ్యల జ్ఞాపకార్ధం సొంత గ్రామంలోని స్మశానవాటికలో దహనవాటికకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ గురువారం బాలాపూర్​ గణపతి లడ్డును దక్కించుకునేందుకు వేలం పాటలో పాల్గొన్నానని,  లడ్డు దక్కకపోవడంతో ఆ నిధులతోనే దహనవాటిక నిర్మాణానికి సంకల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో  తుర్కయంజాల్​ రైతు సేవా సహకార సంఘం పీఐసీ డైరెక్టర్​ మేతరి అశోక్​, వార్డు కమిటీల అధ్యక్షులు జీవీ స్వామి గౌడ్ ,  వాస్పరి బాబయ్య, వెంకట్ రెడ్డి,  గ్రామ పెద్దలు దేశగొని లక్ష్మయ్య గౌడ్,   పలస శ్రవణ్ కుమార్ గౌడ్,  బొడ్డు సుక్కయ్య, నాయకులు  పాల్గొన్నారు.