రూ.6 లక్షలతో కట్టిస్తున్న మాజీ సర్పంచ్ సత్తయ్య
బాలాపూర్ వేలంలో గణపతి లడ్డు అదృష్టం దక్కకున్నా ఆ నిధులతో సామాజిక సేవకు ముందుకు వచ్చారు మాజీ సర్పంచ్ కొత్తకుర్మ సత్తయ్య. దాదాపు రూ.6లక్షల వ్యయంతో తన తల్లిద్రండులు కొత్తకుర్మ రోశమ్మ, పోచయ్యల జ్ఞాపకార్ధం సొంత గ్రామంలోని స్మశానవాటికలో దహనవాటికకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ గురువారం బాలాపూర్ గణపతి లడ్డును దక్కించుకునేందుకు వేలం పాటలో పాల్గొన్నానని, లడ్డు దక్కకపోవడంతో ఆ నిధులతోనే దహనవాటిక నిర్మాణానికి సంకల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం పీఐసీ డైరెక్టర్ మేతరి అశోక్, వార్డు కమిటీల అధ్యక్షులు జీవీ స్వామి గౌడ్ , వాస్పరి బాబయ్య, వెంకట్ రెడ్డి, గ్రామ పెద్దలు దేశగొని లక్ష్మయ్య గౌడ్, పలస శ్రవణ్ కుమార్ గౌడ్, బొడ్డు సుక్కయ్య, నాయకులు పాల్గొన్నారు.