గద్వాలలో బయటపడ్డ జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే మధ్య విభేదాలు

గద్వాలలో బయటపడ్డ  జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే మధ్య విభేదాలు

జోగులాంబ జిల్లా గద్వాలలో ఓ జిల్లా స్థాయి అధికారి గల్లా పట్టుకొని ఆయనపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో పాటు జడ్పీ చైర్ పర్సన్ సరితను అధికారులు ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే రాకముందే జడ్పీ చైర్ పర్సన్ గురుకుల స్కూల్ ను ప్రారంభించారు.  

దీంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడే ఉన్న  ఓ అధికారి గల్లా పట్టుకొని  తాను రాకముందే స్కూల్ ను ఎలా ప్రారంభిస్తారంటూ బూతులు తిట్టారు. ఎమ్మెల్యే తీరుతో అక్కడే ఉన్న అధికారులు విస్తుపోయారు. గత కొద్దీ రోజులుగా గద్వాల టీఆర్ఎస్ నేతల మధ్య వర్గ పోరు ఎక్కువైంది. జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేల గ్రూపుల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి. ఆధిపత్యం కోసం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.