హ్యాండిచ్చిన రోహిత్, కోహ్లీ.. భారత్కి మైండ్ బ్లాకింగ్ షాక్!

హ్యాండిచ్చిన రోహిత్, కోహ్లీ.. భారత్కి మైండ్ బ్లాకింగ్ షాక్!

RoKo Collapse: భారత అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆ క్షణం రానే వచ్చింది. 259 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మైదానంలో ఒక రేంజ్ వినోదం లభిస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, వారి ఆశలపై ఇంగ్లాండ్ బౌలర్లు నీళ్లు చల్లారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇండియన్ టీమ్ జెర్సీలో కనిపించిన ఇద్దరు దిగ్గజ బ్యాటర్లు.. తీవ్ర నిరాశకు గురి చేస్తూ ఒకరి వెనుక మరొకరు పెవిలియన్ కి క్యూ కట్టారు. ఇంగ్లాండ్ పేసర్లు వేసిన పదునైన బంతులకి రోహిత్, కోహ్లీ ఔట్ కావడంతో చేజింగ్ లో భారత్ కష్టాల్లో పడింది. 

సామ్ కర్రన్ యాంగిల్ ఉచ్చులో చిక్కుకున్న హిట్‌మ్యాన్: 
రన్ చేజ్‌ను దూకుడుగా ప్రారంభించాలనుకున్న రోహిత్ శర్మ మంచి లయలోనే ఉన్నట్లు కనిపించాడు. కానీ, సామ్ కర్రన్ వేసిన ఒక స్మార్ట్ స్కెచ్‌కు చిత్తయ్యాడు. 21 బంతుల్లో 11 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. లెఫ్ట్ ఆర్మ్ పేసర్పై ఒత్తిడి పెంచేందుకు క్రీజు దాటి ముందుకు వచ్చాడు. బంతిని లెగ్ సైడ్ వైపు తిప్పాలని ప్రయత్నించగా.. సామ్ వేసిన బాల్ యాంగిల్ డెలివరీ రోహిత్ బ్యాట్‌కి ఎడ్జ్ అయ్యి, షాట్ గాల్లోకి లేవగా.. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఎలాంటి తప్పు చేయకుండా క్యాచ్ అందుకోవడంతో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ముగిసింది.

ఆర్చర్ బుల్లెట్ బంతి,, కింగ్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూ: 
రోహిత్ శర్మ ఔట్ అయిన వెంటనే స్టేడియం మొత్తం కోహ్లీ, కోహ్లీ అంటూ మార్మోగిపోయింది. కానీ, ఆ సంతోషం కేవలం 6 బంతుల ముగిసిపోయింది. క్రీజులోకి వచ్చిన కోహ్లీని ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. మొదట ఒక షార్ట్ పిచ్ బంతితో కోహ్లీని పరీక్షించిన ఆర్చర్.. ఆ తర్వాతి బంతినే ఎవరూ ఊహించని విధంగా అత్యంత వేగంగా ఫుల్లర్ లెంగ్త్‌లో నేరుగా విసిరాడు. ఆ బంతిని లెగ్ సైడ్ కొట్టడానికి కోహ్లీ షఫుల్ అయినప్పటికీ, వేగాన్ని అంచనా వేయలేక పూర్తిగా మిస్ కావడంతో.. ఆ బంతి నేరుగా వచ్చి మిడిల్ స్టంప్ లైన్‌లో ప్యాడ్‌కు బలంగా తగిలింది, దీంతో అంపైర్ మైక్ బర్న్స్ ఏమాత్రం సందేహం లేకుండా వేలు పైకెత్తాడు. నాన్‌స్ట్రైకర్‌తో కాసేపు మాట్లాడిన కోహ్లీ.. రివ్యూ కూడా తీసుకోకుండానే కేవలం 5 రన్స్ కే డగౌట్ కి చేరాడు. 

►ALSO READ | అదిరిపోనున్న ఫిఫా వరల్డ్ కప్ క్లోజింగ్ సెర్మనీ.. ఒకే వేదికపై టామ్ క్రూజ్‌తో ఐషోస్పీడ్!

ఒత్తిడిలో మిడిలార్డర్.. సిరీస్ బోణీ దక్కేనా?: 
భారత బ్యాటింగ్ కి దిక్కైనా రోహిత్, కోహ్లీ ఇద్దరూ పవర్‌ప్లేలోనే కేవలం 16 పరుగులకే ఔట్ అయి డ్రెస్సింగ్ రూమ్‌కు చేరడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఇంగ్లాండ్ వైపు తిరిగింది. మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లు పూర్తి ఆధిక్యంతో దూసుకెళ్తుంటే, ఇంకోవైపు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేజింగ్ బాధ్యతలని భూజన వేసుకున్నాడు. ప్రస్తుతం 31.1 ఓవర్లు ముగిసే సమయానికి ఇండియా 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. కాగా శుభ్‌మన్ గిల్ (80) రిటైర్డ్ హార్డ్ కాగా, ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్ (4), వాషింగ్టన్ సుందర్ (13) ఉన్నారు.