బీజేపీ దీక్ష అనగానే కేసీఆర్ కు వణుకు పుట్టింది

బీజేపీ దీక్ష అనగానే కేసీఆర్ కు వణుకు పుట్టింది

జనవరిలోగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామన్నారు  బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. బీజేపీ నిరుద్యోగ దీక్షలో మాట్లాడిన ఆయన.. బీజేపీ దీక్ష అంటే కేసీఆర్ కు వణుకు పుట్టిందన్నారు. బీజేపీ నిరుద్యోగ దీక్షకు వేలాది మంది కార్యకర్తలు తరలివస్తున్నారనే సమాచారంతో కేసీఆర్ కొవిడ్  గుర్తుకొచ్చిందన్నారు. భయంతోనే బీజేపీ నిరుద్యోగ దీక్షకు అనుమతివ్వలేదన్నారు.  నిరుద్యోగుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించదా అని ప్రశ్నించారు. విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యోగాలు సాధించని తెలంగాణ ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగులపై  కేసీఆర్ కు కక్ష్య ఎందుకన్నారు. ఉద్యోగాల కోసం దీక్షలు చేయాల్సి వస్తుందనుకోలేదన్నారు.

విద్యా వాలంటీర్లను తొలగించిన మూర్ఖుడు కేసీఆర్ అని అన్నారు బండి సంజయ్.  గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారన్నారు. ఫిల్డ్ అసిస్టెంట్లను పీకేశారన్నారు. లక్షా 90 వేల ఉద్యాగాల ఖాళీగా ఉన్నాయనని బిశ్వాల్ కమిటీ చెప్పిందన్నారు. జనవరి లోపల  వెంటనే ఉద్యోగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే కేసీఆర్ ను తిరగనివ్వమన్నారు. అసెంబ్లీ లోపల బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ, బయట బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ నడవకుండా  అడ్డుకుంటారన్నారు.  కేసీఆర్ ను అడిగితే దొంగ దీక్షలు  ఎలా  చేయాలో చెబుతారన్నారు. ఖమ్మంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశారన్నారు. ఇంటర్ ఫలితాల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను బండి సంజయ్ ఆదుకోవాలన్నారు.