హైదరాబాద్, వెలుగు : టీ–హబ్లో ఇంక్యుబేట్ అయిన బెంగళూరుకు చెందిన స్టార్టప్ డ్రింక్ప్రైమ్ హైదరాబాద్లో తన ప్రొడక్షన్ ఫెసిలిటీని బుధవారం ప్రారంభించింది. వాటర్ ప్యూరిఫయర్లకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ)ని కనెక్ట్ చేయడం ద్వారా మరింత సురక్షితమైన నీటిని అందిస్తుంది. ఫ్యూరిఫయర్ను మొబైల్యాప్కు లింక్ చేస్తుంది. దీనివల్ల నీటి స్వచ్ఛతను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
తాము హైదరాబాద్లో ఈ ఏడాదిలోనే 60 శాతం వృద్ధిని సాధించామని కంపెనీ తెలిపింది. గత రెండు సంవత్సరాలలో చందాదారుల బేస్ నాలుగు రెట్లు పెరిగిందని పేర్కొంది. ప్రత్యేక హైదరాబాద్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం వల్ల వేగంగా డెలివరీలు ఇవ్వగలుగుతామని డ్రింక్ప్రైమ్ సీఈఓ విజయేందర్ రెడ్డి ముత్యాల చెప్పారు. వచ్చే ఏడాదిలోగా హైదరాబాద్లో లక్ష ఇండ్లకు సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.