
న్యూఢిల్లీ: గ్లోబల్ బ్యాంక్ -- స్టాండర్డ్ చార్టర్డ్ పీఎల్సీ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయుడు, ప్రముఖ బ్యాంకర్ రాణా తల్వార్ 76 ఏళ్ల వయసులో మరణించారు. ఆయనకు భార్య రేణుక, కుమారుడు రాహుల్ ఉన్నారు. డీఎల్ఎఫ్తో పాటు, అసాహి ఇండియా గ్లాస్ లిమిటెడ్ గ్రేట్ ఈస్టర్న్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్తో సహా పలు కంపెనీల బోర్డులలో ఆయన పనిచేశారు. 1948లో జన్మించిన తల్వార్ ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదివాక సిటీ బ్యాంక్తో తన కెరీర్ను
మొదలు పెట్టారు .