పశ్చిమ బెంగాల్లోని బిష్ణుపూర్ నియోజకవర్గంలో మాజీ భార్యాభర్తలు ప్రత్యర్థులుగా నిలవడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున సౌమిత్రా ఖాన్ బరిలో ఉన్నారు. ఆయన మాజీ భార్య సుజాత మండల్ను తృణమూల్ కాంగ్రెస్ పోటీలోకి దించింది. 2019లో సౌమిత్రా ఖాన్ తృణమూల్ నుంచి బీజేపీలో చేరి పోటీ చేశారు. అప్పట్లో ఆయన తరఫున సుజాత ప్రచారం కూడా చేశారు కూడా.
అయితే, మూడేళ్ల క్రితం ఆమె మమత పార్టీలో చేరడంతో ఇద్దరూ 2021లో విడిపోయారు. మమత పార్టీలో ఆమె చేరడం పట్ల అసహనానికి గురైన సౌమిత్రా.. కెమెరా ముందే ఆమెతో విడిపోతున్నట్టు ప్రకటించారు. చూడాలి మరి మాజీ భార్యభర్తలలో గెలుపు ఎవరిదో. కాగా రానున్న లోక్సభ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ 42 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కు చోటు దక్కింది.