
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మలయాళ బ్యూటీ నిత్యా మేనన్(Nithya menon). నటిగా, సింగర్గా చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఆమె సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో లేటెస్ట్ వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి(kumari srimathi). ఇటీవలే ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉంటే.. గత నెల రోజుల నుండి నిత్యామీనన్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోతో నిత్యా మేనన్ పెళ్లి జరగనుందని పలు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఆ వార్తలపై నిత్యా మీనన్ కూడా స్పందించారు. ఆ వార్తల్లో ఏలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
Also Read :- వామ్మో.. ఆ కలెక్షన్స్ ఏందీ సామి!?
తాజాగా నిత్యా పెళ్లి గురించి తమిళ నటుడు, సినీ విమర్శకుడు బైల్వాన్ రంగనాథన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ మలయాళ నటి పెళ్లి చేసుకొని.. భర్త ఇంటివాళ్ళు పపెట్టిన భాదలు పేదలేక ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన నిత్యా మీనన్ మనసులో నాటుకుపోయింది. ఆ భయంతోనే నిత్యా పెళ్ళికి దూరంగా ఉంటోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే.. తాను కూడా గృహహింస భారిన పడాల్సి వస్తుందని, అందుకే ఆమె పెళ్ళికి బాహాయపడుతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బైల్వాన్ రంగనాథన్ నిత్యా మీనన్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి బైల్వాన్ రంగనాథన్ చేసిన కామెంట్స్ లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ కామెంట్స్ నిత్యా ఎలా స్పందిస్తుందో చూడాలి.