
పద్మారావునగర్, వెలుగు: ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని, కుల గణన చేయాలని గాంధీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జక్కని సంజయ్కుమార్, బత్తుల సిద్దేశ్వర్ పటేల్కు శుక్రవారం ఆయన సంఘీభావం తెలిపారు. ఆరు రోజులుగా బీసీ నేతలు చేస్తున్న దీక్షపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణం స్పందించాలని కోరారు. వారి ఆరోగ్యం క్షీణించకముందే ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేర్చాలన్నారు.