బీసీ గురుకుల బ్యాక్ లాగ్ సీట్ల ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదల

 బీసీ గురుకుల బ్యాక్ లాగ్ సీట్ల ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదల
  • ఈ నెల 24న కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాల్లో 6,7,8,9వ తరగతుల బ్యాక్​లాగ్ సీట్ల  కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్టు సెక్రటరీ సైదులు వెల్లడించారు. ఫలితాలు  www.mjptbcwreis.telangana.gov.in   లేదా https://mjptbcadmissions.org  వెబ్ సైట్ లలో అందుబాటులో ఉన్నాయని  గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు. 

ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో 6,832 బ్యాక్​లాగ్ సీట్లు ఉండగా ఆన్‌‌లైన్ లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 23,611 మంది గత నెల 20న  పరీక్ష రాశారని ఆయన చెప్పారు. ఈ నెల 24న కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు.