ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్న T20 వరల్డ్కప్కు వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది.ఫైనల్ సహా మ్యాచ్ లను 8 వేదికల్లో నిర్వహించనున్నట్టు సమాచారం.ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగుళూరు, హైదరాబాద్, ధర్మశాల నగరాల్లో టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లను అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు. మరో వైపు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వీసా అవాంతరాలు తొలగినట్లు తెలుస్తోంది. వరల్డ్కప్లో పాల్గొనేందుకు వచ్చే పాక్ జట్టుకు ఎటువంటి వీసా సమస్యలు ఉండవని బీసీసీఐ సెక్రటరీ జే షా తెలిపారు.
పాకిస్థాన్ ఆటగాళ్లు వీసా కల్పించే అంశంలో ప్రభుత్వం వీసాలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు జే షా చెప్పారు. ఆటగాళ్లకు వీసాలు ఇచ్చినా.. విదేశీ అభిమానులకు వీసాలు ఇవ్వాలా వద్దా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.