న్యూఢిల్లీ: ఐపీఎల్–2022 మెగా ఆక్షన్పై కొవిడ్ ఎఫెక్ట్ పడే చాన్స్ కనిపిస్తోంది. దేశంలో థర్డ్ వేవ్ సంకేతాలు మొదలుకావడంతో.. ఆక్షన్ వెన్యూను బెంగళూరు నుంచి షిఫ్ట్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అలాగే ముందుగా అనుకున్న ఫిబ్రవరి 12, 13 తేదీలు కూడా మారే చాన్స్ కనిపిస్తున్నది. హోటల్స్, కొవిడ్–19 రిస్ట్రిక్షన్స్ ఇందుకు ప్రధానంగా కారణంగా తెలుస్తున్నది. ఇప్పటివరకు బెంగళూరులో హోటల్ బుక్సింగ్ జరగలేదు. రెండు స్టార్ హోటల్స్ను అప్రోచ్ అయినప్పటికీ.. కర్నాటక గవర్నమెంట్ ఇచ్చే గైడ్లైన్స్ కోసం బీసీసీఐ వెయిట్ చేస్తోంది. మాస్ గ్యాదరింగ్పై క్యాప్ పెట్టాలని ఆ స్టేట్ గవర్నమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆక్షన్ పోస్ట్పోన్ కావడంతో పాటు వేరే ప్లేస్కు షిఫ్ట్ అయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.