కరోనా టైమ్ లో ఐపీఎల్.. BCCI వెయ్యి కోట్లు ఇవ్వాల్సిందే

కరోనా టైమ్ లో ఐపీఎల్.. BCCI వెయ్యి కోట్లు ఇవ్వాల్సిందే

ముంబై: ఆక్సిజన్ సరఫరా, వైద్య పరికరాల కొరకు రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరుతూ BCCI బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. వందన షా అనే లాయర్ ఈ పిల్ దాఖలు చేయగా..కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా IPL నిర్వహించి నష్టం కలిగించారని తెలిపారు. అందుకే రూ.వెయ్యి కోట్లు, ఆర్జించిన లాభాన్నీ విరాళంగా ఇవ్వాలన్నారు. అలాగే ప్రజల సంక్షేమంపై బోర్డు వైఖరేంటో తెలపాలని పిటిషన్ లో తెలిపారు. ప్రస్తుతం కొంతమంది ప్లేయర్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఈ సీజన్ ఐపీఎల్ ను నిలిపివేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు