వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ కఠిన నిర్ణయాలు

వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ కఠిన నిర్ణయాలు
  • హార్దిక్ పాండ్యాపై వేటు

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ ఘోర వైఫల్యం నేపథ్యంలో.. బీసీసీఐ కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌కు టీమ్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ లేక ఇబ్బందిపడుతున్న ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యాపై వేటు ఖాయంగా కనిపిస్తోంది. అలాగే పాండ్యా ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ విషయంలో పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని సెలెక్షన్‌‌‌‌‌‌‌‌ కమిటీ, టీమ్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను  బోర్డు ఆదేశించినట్లు సమాచారం. గాయపడిన ప్లేయర్లను...ఎన్‌‌‌‌‌‌‌‌సీఏకు పంపకుండా టీమ్‌‌‌‌‌‌‌‌లోకి ఎందుకు తీసుకున్నారో వివరణ కోరనుంది.