మధ్యప్రదేశ్ షాహ్దోల్ జిల్లా రాజ్ మడ అడవి దగ్గర్లో ఉంటాడీ సన్యాసి. పొద్దునే ఏక్తార మీటుతూ భజన్లు పాడుతుంటాడు. అవి వినడానికి శ్రోతలున్నారు. ఫొటోలో కనిపిస్తున్న గుడ్డెలుగులే ఈ శ్రోతలు.
భజన్లు విన్నాక, పెట్టే ప్రసాదం తిన్నాక నెమ్మదిగా పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోతాయి. ఎనిమిదేళ్లుగా ఈ గుడ్డెలుగులకు దినచర్య ఇదే అంటున్నారు 65 ఏళ్ల సన్యాసి సీతారామ్. ఇంతవరకు ఆ గొడ్డెలుగులు ఎవరిపైనా దాడిచేయలేదట.