
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) ఘజియాబాద్ యూనిట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 4.
పోస్టుల సంఖ్య: 32.
పోస్టులు: ప్రాజెక్ట్ ఇంజినీర్–1 24, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ 08.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్ లేదా బీఈ లేదా బీఎస్సీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఆగస్టు 05.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.400.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు bel-india.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
సాలరీ: రూ.40 వేల నుంచి 70 వేల వరకు