బీటెక్ లేదా బీఎస్సీ పాసైన వారికి గుడ్ న్యూస్ .. BELలో రూ.70 వేల జీతంతో జాబ్స్

బీటెక్ లేదా బీఎస్సీ పాసైన వారికి గుడ్ న్యూస్ ..  BELలో  రూ.70 వేల  జీతంతో జాబ్స్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) ఘజియాబాద్ యూనిట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 4. 

పోస్టుల సంఖ్య: 32.
పోస్టులు: ప్రాజెక్ట్ ఇంజినీర్–1 24, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ 08. 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్ లేదా బీఈ లేదా బీఎస్సీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
అప్లికేషన్: ఆన్​​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఆగస్టు 05.  
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.400. 
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు bel-india.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

సాలరీ: రూ.40 వేల నుంచి 70 వేల వరకు