దారుణం.. అక్కాచెల్లెళ్లను కాళ్లు చేతులు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లి…

దారుణం.. అక్కాచెల్లెళ్లను కాళ్లు చేతులు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లి…

పశ్చిమ బెంగాల్ లో దారుణం జరిగింది. ఓ మహిళా టీచర్ ను తాళ్లతో కట్టి  రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన దక్షిణ దినజ్‌పూర్ జిల్లాలోని గంగరంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఫటా నగర్ గ్రామంలో జరిగింది. అసలేం జరిగిందంటే.. స్మ్రతి కోనా దాస్ అనే ఓ మహిళా టీచర్ స్థానిక  ఉన్నత పాఠశాలలో టీచర్ .. ఆమె చెల్లెలు తల్లితో కలిసి ఫటా నగర్లో నివసిస్తుంది. వారి ఇంటి ముందు రోడ్డు వేస్తున్నారు. దీనికి 12 అడుగుల వెడల్పు స్థలం వెళ్తుందని పంచాయతీ పెద్దలు చెప్పారు. దీనికి వారు ఓకే అన్నారు. కానీ తర్వాత 24 అడుగుల వెడల్పు చేయాలని పంచాయతీ నిర్ణయించింది. దీనికి వారు  ఒప్పుకోలేదు. 24 అడుగుల వెడల్పు అంటే తమ స్థలం మరింత ఎక్కువ పోతుందని వారు అభ్యంతరం చెప్పారు.

శుక్రవారం రోడ్డు పనుల్ని ప్రారంభించడానిక బుల్డోజర్ ,రోడ్డురోలర్ రాగానే ఆ మహిళా టీచర్ కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పి నిరసన తెలిపారు.  అడ్డు వెళ్లిన ఆ మహిళా టీచర్ ను  స్థానికులు కొందరు ఆమె మోకాళ్లను, చేతులను తాళ్లతో కట్టి మట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. తన చెల్లెల్ని ఈడ్చుకెళుతుండగా అడ్డు వచ్చిన ఆమె అక్కను కూడా లాక్కెకెళ్లారు. అక్కడున్న వారు చూస్తూ ఉండిపోయారు కానీ ఏం చేయలేకపోయారు.  తర్వాత వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆదివారం ఆస్పత్రి నుంచి వచ్చిన మహిళా టీచర్  ఈ ఘటన వెనక ఉన్న  గ్రామ పంచాయతీ వైస్ చీఫ్ అమల్ సర్కార్, మరో ఐదుగురిపై  పోలీసులకు ఫిర్యాదు చేసింది.