క్యారీ బ్యాగ్ కు రూ.20 వసూలు.. ఐకియాకు 3 వేల ఫైన్

క్యారీ బ్యాగ్ కు రూ.20 వసూలు.. ఐకియాకు 3 వేల ఫైన్

బెంగళూరు: ​షాపింగ్ ​చేసిన తర్వాత ఓ కస్టమర్ ​నుంచి క్యారీ బ్యాగ్ కోసం రూ.20 వసూలు చేసిన బెంగళూరు ఐకియా స్టోర్ కు ​కోర్టు రూ.3 వేల ఫైన్​ వేసింది.​ బెంగుళూరుకు చెందిన సంగీత బోహ్ర అనే మ‌‌హిళ గతేడాది ఐకియా మాల్‌‌లో షాపింగ్ చేసింది. కొన్న వస్తువులను ఇంటికి తీసుకువెళ్లేందుకు బిల్లింగ్​దగ్గర ఉన్న సిబ్బందిని క్యారీ బ్యాగ్ అడిగింది. ఐకియా లోగోతో ఉన్న క్యారీ బ్యాగ్‌‌ను ఇచ్చిన సిబ్బంది.. ఆమె నుంచి రూ.20 వ‌‌సూలు చేశారు.

కంపెనీ లోగో ఉన్న బ్యాగ్‌‌ల‌‌కు డ‌‌బ్బులు ఎలా వ‌‌సూలు చేయడం, ముందు చెప్పకుండానే చార్జ్​ చేయడంపై ఆమె అభ్యంతరం తెలిపింది. యాజ‌‌మాన్యం ప‌‌ట్టించుకోకపోవడంతో రాష్ట్ర వినియోగ‌‌దారుల క‌‌మిష‌‌న్‌‌ను ఆశ్రయించింది. పిటిషనర్​వాదనలతో ఏకీభవించిన కమిషన్​  నష్టపరిహారం కింద సంగీతకు నెల రోజుల్లోపు రూ.3,000 చెల్లించాలని ఐకియాను ఆదేశించింది.