
బెంగళూరు: షాపింగ్ చేసిన తర్వాత ఓ కస్టమర్ నుంచి క్యారీ బ్యాగ్ కోసం రూ.20 వసూలు చేసిన బెంగళూరు ఐకియా స్టోర్ కు కోర్టు రూ.3 వేల ఫైన్ వేసింది. బెంగుళూరుకు చెందిన సంగీత బోహ్ర అనే మహిళ గతేడాది ఐకియా మాల్లో షాపింగ్ చేసింది. కొన్న వస్తువులను ఇంటికి తీసుకువెళ్లేందుకు బిల్లింగ్దగ్గర ఉన్న సిబ్బందిని క్యారీ బ్యాగ్ అడిగింది. ఐకియా లోగోతో ఉన్న క్యారీ బ్యాగ్ను ఇచ్చిన సిబ్బంది.. ఆమె నుంచి రూ.20 వసూలు చేశారు.
కంపెనీ లోగో ఉన్న బ్యాగ్లకు డబ్బులు ఎలా వసూలు చేయడం, ముందు చెప్పకుండానే చార్జ్ చేయడంపై ఆమె అభ్యంతరం తెలిపింది. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. పిటిషనర్వాదనలతో ఏకీభవించిన కమిషన్ నష్టపరిహారం కింద సంగీతకు నెల రోజుల్లోపు రూ.3,000 చెల్లించాలని ఐకియాను ఆదేశించింది.