బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం.. 10 బస్సులు దగ్ధం

బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం.. 10  బస్సులు దగ్ధం

బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  వీరభద్రనగర్‌లోని బస్ డిపోలో  పార్కింగ్  చేసిన స్థలంలో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి.  క్షణాల్లోనే మంటలు  వ్యాపించడంతో స్థానికులంతా భయాందోళనతో  పరుగులు తీశారు. ఈ ఘటనలో 5 నుంచి 10   ప్రైవేట్ బస్సులు  పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. 

స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పొగలు అలుముకుపోవడంతో  మంటలను ఆర్పేందుకు ఇబ్బంది అవుతోంది.