మూసాపేట, వెలుగు: ఇంటి ఓనర్ మెడలోని గోల్డ్ చైన్ను కొట్టేసిన వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిలా కందుకూరుకు చెందిన మల్లా వెంకటేశ్వర రావు(24) సిటీకి వచ్చి నిజాంపేటలోని ప్రశాంత్నగర్లోని ఓ ఇంట్లో రెంట్కు ఉంటున్నాడు. ఫుడ్ డెలీవరీ బాయ్గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పడుతున్నాడు. అతడు ఉంటున్న బిల్డింగ్లో ఓ పోర్షన్ ఖాళీగా ఉండటంతో ఓనర్ మహాలక్ష్మి టులెట్ బోర్డు పెట్టింది.
శుక్రవారం అందులో ఉన్న నంబర్ కు కాల్ చేసిన వెంకటేశ్వరరావు మహాలక్ష్మికి అనుమానం రాకుండా వేరే పేరు చెప్పి మాట్లాడాడు. ఆ టైమ్లో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్నాడు. లోపలికి వెళ్లిన వెంకటేశ్వరరావు.. మహాలక్ష్మి కండ్లల్లో శనగపిండి చల్లి మెడలోని పుస్తెలతాడును తెంపుకుని పరారయ్యాడు. బాదితురాలి కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడి నుంచి 3 తులాల బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.