లెక్చరర్ గదిలో బిటెక్ విద్యార్థిని సూసైడ్

లెక్చరర్ గదిలో బిటెక్ విద్యార్థిని సూసైడ్

విశాఖ:  విశాఖ జిల్లా మల్కాపురంలోని ఓ కాలేజీలో బీటెక్ విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. మల్కాపురం జనతా కాలనీకి చెందిన  జ్యోత్స్న అనే విద్యార్థిని తన లెక్చరర్ గదిలోనే ఉరి వేసుకుంది.  తనను ప్రేమిస్తున్నానంటూ వెనుక పడిందని లెక్చరర్ కిష్లే పోలీసులకు చెప్పాడు. ఇదే విషయాన్ని జ్యోత్స్న తల్లిదండ్రులకు కూడా చెప్పానని  లెక్చరర్ కిష్లే వివరణ ఇచ్చాడు. లెక్చరర్ కిష్లేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం  రిపోర్టు తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.