భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఆర్టీసీ బస్టాండులో బుధవారం రాత్రి పోలీసులు 11 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వివేక్ విరాట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా మహాపారా గ్రామానికి చెందిన ఇతను ఒడిశాలోని కలిమెల ప్రాంతానికి చెందిన గంజాయి వ్యాపారి నితీశ్కుమార్ నుంచి గంజాయిని తీసుకుని హైదరాబాదుకు తరలిస్తున్నాడు. పట్టుబడిన గంజాయి విలువ రూ.5,43,500లు ఉంటుందని సీఐ నాగరాజు తెలిపారు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా ఆయన చెప్పారు.
