అక్రమ ఆస్తులపై చన్నీ క్లారిటీ ఇవ్వాల్సిందే

అక్రమ ఆస్తులపై చన్నీ క్లారిటీ ఇవ్వాల్సిందే

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ సిఎం అభ్యర్థి భగవంత్ మాన్ అమృత్‌సర్లో పర్యటించారు. అక్కడ శ్రీరామ తీరథ్ మందిర్ మరియు స్వర్ణ దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చన్నీపై కీలక వ్యాఖ్యలు చేశారు. చన్నీ తనపై పోటీ చేయాలనుకుంటే.. ఆయనను ధురీకి ఆహ్వానిస్తున్నానన్నారు భగవంత్ మాన్. తన పేరు మీద ఉన్న రూ.56 కోట్ల విలువైన అక్రమ ఆస్తులపై తప్పనిసరిగా చన్నీపై స్టేట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చన్నీజీ అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారని కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా అంగీకరించారన్నారని పేర్కొన్నారు భగవంత్ మాన్, పంజాబ్‌లో ఆప్ సీఎం అభ్యర్థి.