కొనసాగుతున్న భట్టి పాదయాత్ర

కొనసాగుతున్న భట్టి పాదయాత్ర

ఖమ్మం: మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క... ప్రజాసమస్యలపై చేపట్టిన పాదయాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. పమ్మిలో ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సమస్యలు పరిష్కరించాలంటూ స్థానికులు వినతి పత్రం ఇచ్చారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్నిఅవమానిస్తున్నారన్నారు భట్టి విక్రమార్క. అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానించకుండా గవర్నర్ ను అవమానిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ లాంటి వారి కోసమే సీఎంను బర్తరఫ్ చేసే అధికారాన్ని రాజ్యాంగంలో అంబేద్కర్ రాశారన్నారు భట్టి విక్రమార్క.

మరిన్ని వార్తల కోసం..

ధరణితో తప్పని రైతు కష్టాలు