
యాదాద్రి, వెలుగు : వడ్ల కొనుగోలు సమయంలో రైతులకు న్యాయం జరిగే విధంగా మిల్లర్లు సహకరించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు. జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ నూతన బిల్డింగ్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనుగోలు సమయంలో బస్తాకు కిలో వడ్లు చొప్పున కొందరు మిల్లర్లు కట్ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, అలాంటివి చేయడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. రైతులు, ప్రభుత్వానికి మధ్య మిల్లర్లు వారధిగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్వీరారెడ్డి, స్టేట్రైస్మిల్లర్అసోసియేషన్అధ్యక్షుడు గంప నాగేందర్, జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్అధ్యక్షుడు మార్త వెంకటేశ్ పాల్గొన్నారు.
భువనగిరిని అభివృద్ధి చేస్తా..
భువనగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలో మార్నింగ్వాక్ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్తో మాట్లాడారు. పట్టణంలో నెలకొన్ని సమస్యలపై ఆరా తీశారు. పట్టణంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జగదేవ్పూర్ వైపు వెళ్లే రోడ్డులోని బ్రిడ్జిని పరిశీలించి రిపేర్ చేయిస్తానని ఆయన తెలిపారు.