బస్వాపురం రిజర్వాయర్కు ఫండ్స్ రిలీజ్ ..మంత్రి ఉత్తమ్ కు  ఎమ్మెల్యే కుంభం కృతజ్ఞతలు

బస్వాపురం రిజర్వాయర్కు ఫండ్స్ రిలీజ్ ..మంత్రి ఉత్తమ్ కు  ఎమ్మెల్యే కుంభం కృతజ్ఞతలు

యాదాద్రి, వెలుగు : బస్వాపురం రిజర్వాయర్​కు ఫండ్స్​ రిలీజ్​ చేసిన మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు. ఫండ్స్​ రిలీజ్​ చేయడం వల్ల పెండింగ్​లో ఉన్న పనుల్లో కొన్నింటిని పూర్తి చేసి నీరు విడుదల చేసి చెరువులు నింపామని చెప్పారు. బస్వాపురం రిజర్వాయర్​పై ఎమ్మెల్యే కుంభం అసెంబ్లీలో మాట్లాడారు. గత ప్రభుత్వం రిజర్వాయర్​ను నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫండ్స్​ రిలీజ్​ చేసిందన్నారు. నిర్వాసితులకు రూ. 30 కోట్లు అందించామని చెప్పారు. ఆర్​ అండ్​ ఆర్​ ప్యాకేజీ కోసం మరో రూ. 134 కోట్లు అందించాల్సి ఉందని ఆయన తెలిపారు.