హైదరాబాద్: త్యాగానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రం ఊరేగింపునకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆదివారం పాతబస్తీలో ప్రసిద్ధ బీబీ కా ఆలం ఊరేగింపు ప్రారంభమైంది. ఈ ఊరేగింపునకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోవిడ్ ఆంక్షలతో ఏనుగుపై కాకుండా డీసీఎం వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. యాకత్పురా, చార్మినార్ గుల్జార్హౌస్, మీరాల మండి, దారుల్ షిఫా మీదుగా చాదర్ ఘాట్ వరకు ఆలం ఊరేగింపు జరిగింది.
భారీగా వచ్చిన ముస్లింలు, షీ యాలు…పీరీలకు దట్టీలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఊరేగింపులో కరోనా సేఫ్టీ ప్రికాషన్స్ కొందరు పబ్లిక్ పాటించడంలేదు. కొంత మంది సోషల్ డిస్టన్స్ ,ఫేస్ మాస్క్ పెట్టుకోకుండానే ఊరేగింపులో పాల్గొన్నారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అడిషనల్ సీపీ శిఖగోయల్, చౌహన్, ట్రాఫిక్ ఆడిసినల్ సీపీ అనిల్ కుమార్.