వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇండియా టూర్ ఖరారైంది. ఈ నెల 7న ఆయన మనదేశానికి రానున్నట్లు వైట్హౌస్ శనివారం ప్రకటించింది. జీ20 సమ్మిట్కు రెండ్రోజుల ముందే బైడెన్ భారత్లో అడుగుపెట్టనున్నారు. ఈ టూర్లో ప్రధాని నరేంద్ర మోదీతో బైడెన్ భేటీ కానున్నారు.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. భారత్ అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనుంది. ‘‘సమ్మిట్లో పాల్గొనేందుకు 7వ తేదీన బైడెన్ ఢిల్లీకి బయల్దేరుతారు. 8వ తేదీన ప్రధాని మోదీతో చర్చలు జరుపుతారు. 9, 10 తేదీల్లో జరిగే జీ20సమ్మిట్లో పాల్గొంటారు” అని వైట్ హౌస్ పేర్కొంది. గ్లోబల్ సమస్యలను ఎదుర్కొనేందుకు చేస్తున్న ఉమ్మడి ప్రయత్నాలపై జీ20 పార్టనర్స్ సమ్మిట్ లో చర్చించనున్నారు.