జీ20 సమ్మిట్​కు ముందురోజే భారత్కు బైడెన్

జీ20 సమ్మిట్​కు ముందురోజే భారత్కు బైడెన్

వాషింగ్టన్​: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్​ ఇండియా టూర్ ఖరారైంది. ఈ నెల 7న ఆయన మనదేశానికి రానున్నట్లు వైట్​హౌస్ శనివారం ప్రకటించింది. జీ20 సమ్మిట్​కు రెండ్రోజుల ముందే బైడెన్ భారత్​లో అడుగుపెట్టనున్నారు. ఈ టూర్​లో ప్రధాని నరేంద్ర మోదీతో బైడెన్ భేటీ కానున్నారు. 

ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. భారత్​ అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్​9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనుంది. ‘‘సమ్మిట్​లో పాల్గొనేందుకు 7వ తేదీన బైడెన్​ ఢిల్లీకి బయల్దేరుతారు. 8వ తేదీన ప్రధాని మోదీతో చర్చలు జరుపుతారు. 9, 10 తేదీల్లో జరిగే జీ20సమ్మిట్​లో పాల్గొంటారు” అని వైట్ హౌస్ పేర్కొంది. గ్లోబల్​ సమస్యలను ఎదుర్కొనేందుకు చేస్తున్న ఉమ్మడి ప్రయత్నాలపై జీ20 పార్టనర్స్ సమ్మిట్ లో చర్చించనున్నారు.